NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన …. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లా ఎస్పీ  క్యాంపు  కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్  జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు అందచేశారు.ఈ కార్యక్రమంలో    సిఐలు  ప్రసాద్, ఆదినారాయణ,  ఆర్ ఐ  వియస్ రమణ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది   పాల్గొన్నారు.

About Author