PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిపౌల్ స్కూల్ లో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  కరివేనా గ్రామంలోని  డిపౌల్ స్కూల్ లో మంగళవారం ప్రిన్సిపాల్  ఫాదర్ జై సన్  వైస్ ప్రిన్సిపాల్ వినీత్   ఆధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు సాగలన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ షాంతో , ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author