PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ్యూజిక్ ఫెస్టివ‌ల్ లో తొక్కిస‌లాట‌.. 8 మంది మృతి !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : అమెరికాలోని టెక్సాస్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ మ్యూజిక్ ఫెస్టివ‌ల్ లో ఏర్పడిన గందర‌గోళం కార‌ణంగా తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెంద‌గా 300 దాక గాయ‌ప‌డ్డారు. హ్యూస్టన్ లో నిర్వహించిన ఆస్ట్రోవ‌ర‌ల్డ్ మ్యూజిక్ ఫెస్టివ‌ల్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాత్రి 9 గంట‌ల స‌మయంలో ప్రేక్షకులు వేదిక వైపు దూసుకురావడంతో అక్కడున్న వారిలో భయాందోళ‌న‌కు దారితీసింది. దీంతో కొంద‌రు గాయ‌ప‌డ్డారు. మ‌రికొంద‌రు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. ఇప్పటి వ‌ర‌కు 8 మంది మృతి చెందిన‌ట్టు హ్యూస్టన్ అధికారులు తెలిపారు.

About Author