NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: వైసీపీలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని… తిరుగుబాటు చేసేందుకు 80 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. సొంత ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని జగన్… కుప్పంలో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంగా జరిగిందని చెప్పారు. రైతుల పాదయాత్ర జరుగుతుంటే… వీధిలైట్లు తీయించే స్థాయికి బూతుల మంత్రి దిగజారాడని మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి అన్నారు.

                                          

About Author