PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలా అన్నందుకు 800 మంది ఉద్యోగుల రాజీనామా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుటెక్ కంపెనీ వైట్‌హ్యాట్ జూనియర్‌కు విచిత్ర‌ పరిస్థితి ఎదురైంది. కంపెనీకి చెందిన 800 మంది ఉద్యోగులు కేవలం 2 నెలల వ్యవధిలోనే స్వచ్ఛంధంగా రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం ఆఫీస్ పున:కొనసాగించాలని కంపెనీ కోరడమే ఇందుకు కారణమైంది. మళ్లీ ఆఫీస్ నుంచి పనిచేయాలనుకోవడంలేని ఉద్యోగులు చెబుతున్నారు. ముంబై, బెంగళూరు, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లోని కంపెనీ యూనిట్ల నుంచి తిరిగి పనిచేయాలని తెలుపుతూ మార్చి 18న ఉద్యోగులకు కంపెనీ ఈ-మెయిల్స్ పంపించింది. ఈ ఆదేశాలను పాటించకపోగా ఉద్యోగులు రాజీనామా లేఖలు పంపారని ఐఎన్‌సీ42 రిపోర్ట్ పేర్కొంది. రాజీనామాల సంఖ్య పెరగొచ్చని అంచనా వేసింది.

                         

About Author