NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రంలో శనివారం కొత్తగా 865 కరోనా కేసులు నమోదైనట్లుగా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 20,49,103కు చేరింది. అయితే 24గంటల వ్యవధిలో రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున మొత్తం 9మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,195కు చేరింది. శనివారం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,424 ఉండగా రాష్ట్రంలో మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారు 20,24,334కు చేరారు. ఒకరోజులో 50,304మంది నుంచి కరోనా పరీక్ష నమూనాలను సేకరించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య మొత్తం 2,84,00,471కి చేరింది. ఆయా జిల్లాల్లోని వైద్యశాలల్లో 10,574మంది చికత్స పొందుతున్నారు.
కాగా 24గంటల్లో కరోనా బారిన వారిలో అనంతపురం జిల్లాలో 7మంది, చితూరులో 168, తూ.గోదావరిలో 172, గూంటూరులో 117, కడప 23, కృష్ణలో 75, కర్నూలులో 4, నెల్లూరులో 75, ప్రకాశంలో 90, శ్రీకాకుళంలో 4, విశాఖలో 35, విజయనగరంలో 15, ప.గోదావరిలో 80మంది చొప్పు ఉన్నారు.

About Author