NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆకలి నుండి స్వేచ్ఛ – భయం నుండి స్వేచ్ఛే ఎస్‌డీపీఐ లక్ష్యం

1 min read

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా

హోళగుంద న్యూస్ నేడు:“ఆకలి నుండి స్వేచ్ఛ – భయం నుండి స్వేచ్ఛ” అనే నినాదంతో ప్రజల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తోందని ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ తెలిపారు.ప్రజలకు ఏ సమస్య వచ్చినా కేవలం మాటలకే పరిమితం కాకుండా, సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడమే ఎస్‌డీపీఐ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై దృష్టి

మండలంలోని వివిధ వార్డులు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని అబ్దుల్ హమీద్ తెలిపారు. వీధుల్లో డ్రైనేజీలు పేరుకుపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, చెత్త పేరుకుపోవడం, రోడ్ల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, వీధి దీపాల సమస్యలు వంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

ప్రజలు తమ సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చిన వెంటనే సంబంధిత ప్రాంతానికి వెళ్లి సమస్య తీవ్రతను పరిశీలించి, పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

డ్రైనేజీల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం

వర్షాకాలంలో మురుగు కాలువలు, డ్రైనేజీలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోవడం వల్ల దోమలు పెరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నామని చెప్పారు.ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం స్థానిక సంస్థల బాధ్యత అని, డ్రైనేజీలు, కాలువలు, వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే. సలాం, కార్యదర్శి కే. అబ్దుల్ రెహ్మాన్, ప్రధాన కార్యదర్శి ఎం. హఫీజ్, కోశాధికారి బి. అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు.ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, పేదల సంక్షేమం కోసం “ఆకలి నుండి స్వేచ్ఛ – భయం నుండి స్వేచ్ఛ” అనే నినాదంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరింత బలంగా ప్రజల మధ్య ముందుకు సాగుతుందని ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *