ఉద్యమకార్యచరణలో భాగంగా ఉద్యమ నోటీసు జిల్లా కలెక్టర్ కు అందజేత
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు ఉద్యమకార్యచరణలో భాగముగా ఉద్యమ నోటీసును జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సిరి, కి APJAC అమరావతి కర్నూల్ జిల్లా పక్షాన అందజేయడం జరిగినది. ఈ సందర్భముగా మేడం కి ఉద్యమానికి వెళ్ళవలసిన ఆవశ్యకతను వివరిస్తూ 29 డిమాండ్లతో కూడిన ప్రతిని అలాగే ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ను మేడం గారికి అందజేయడం జరిగినది. మేడం సానుకూలంగా స్పందిస్తూ డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రిటైర్డ్ ఉద్యోగుల నుండి మురళీకృష్ణ నాయుడు శంకరప్ప రంగ రెడ్డి పంచాయతీరాజ్ నుండి జ్యోస్నా దని బాబు APPTD (RTC ) నుండి మహేష్ సాలమ్మ OUTSOURCING నుండి విష్ణువర్ధన్ SLTA (state language teachers association) నుండి మద్దిలేటి వెంకటేష్ APJAC అమరావతి మహిళా విభాగం నుండి పద్మ గులాబీ రేచల్ సునీత డ్రైవర్స్ అసోసియేషన్ నుండి నాగేశ్వర రావు జిల్లా కార్యవర్గ సభ్యులైన సునీల్ కుమార్ లోకేశ్వర రెడ్డి, జగదీశ్వర రావు, శివపార్వతి, కృష్ణవేణి దినోజ్ కుమార్, నూర్ అహమ్మద్ కర్నూల్ డివిజన్ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి, సెక్రటరీ గురుస్వామి ట్రెజరర్ సందీప్ నాయక్, గోవిందు,అన్వర్, తరుణ్, రాజు నాయక్, విష్ణు మాధవ, రజాక్, అఖిలేశ్వర్ రెడ్డి, వీఆర్ఓ ల జిల్లా అధ్యక్షులు సూరి బాబు, స్వామన్న, గ్రేడ్ 2 వీఆర్ఓ ల నుండి మద్దిలేటి రాముడు ప్రశాంత్ రామాంజి ప్రవల్లిక లక్ష్మి దేవి వీఆర్ఏ ల జిల్లా అధ్యక్షులు చిన్న స్వామి, థాయప్ప తదితరులు పాల్గొన్నారు.


