NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌ల‌స‌ల వంట‌నూనెలు.. రైతు బ‌జార్ల‌లో విక్ర‌యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ప్రభావం వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.170–175, పామాయిల్‌ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్‌ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్‌తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్‌ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్‌తో సహా నూనెలన్నీ లీటర్‌ రూ.200 పైనే పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు.

                                     

About Author