PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థర్మల్​ స్కానర్​తో.. టెంపరేచర్​ చూడండి

1 min read
ఫీవర్​ సర్వే బృందాలతో మాట్లాడుతున్న కలెక్టర్​ ఎస్​. వెంకటరావు

ఫీవర్​ సర్వే బృందాలతో మాట్లాడుతున్న కలెక్టర్​ ఎస్​. వెంకటరావు

– ఫీవర్​ సర్వే బృందాన్ని ఆదేశించిన కలెక్టర్​ ఎస్​. వెంకటరావు
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​: జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా ఫీవర్​ సర్వే చేయాలని కలెక్టర్​ ఎస్​. వెంకటరావు ఆదేశించారు. శనివారం మహబూబ్​నగర్​ పట్టణంలోని ఝాన్సీ నగర్ ,హనుమాన్ నగర్ లో ఫీవర్​ సర్వే బృందాల పనితీరును కలెక్టర్​ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ప్రజలకు థర్మల్​ స్కానర్​ ద్వారా టెంపరేచర్​ చెక్​ చేయాలని ఫీవర్ సర్వే బృందాలను ఆదేశించారు. కాలనీ వాసులతో కలెక్టర్ సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందాలు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారా ? ఎలాంటి వివరాలు అడుగుతున్నారు ? జ్వరం ,దగ్గు, జలుబు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారా? మీరందరూ పూర్తి వివరాలను సర్వే బృందానికి ఇస్తున్నారా? అని అడిగారు. ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలుంటే సర్వే బృందానికి తెలియజేయాలని చెప్పారు. కలెక్టర్​ వెంట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ తదితరులు ఉన్నారు.

About Author