PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలసాయిబాబా ఆశ్రమంలో…శివరాత్రి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు:మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని.. కర్నూలు నగరంలోని  తుంగభద్ర నదీ తీరమున వెలిసిన బాలసాయి బాబా ఆశ్రమంలో శనివారం శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు బాలసాయిబాబా సెంట్రల్​ ట్రస్టు చైర్మన్ టి. రామారావు తెలిపారు.  ఉదయం 6 గంటలకు గణపతి పూజ, బాలసాయిబాబా గారికి పంచామృత అభిషేకములు, అర్చనలు, పూజాధికములు, సాయంత్రం 6.30 గంటలకు ప్రథమ యామున గణపతి పూజ , మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా 2వ యామమున రాత్రి 9.14 గంటలకు శివలింగమునకు అన్నాభిషేకం,  అర్చనలు పూజాభిషేకము , 3వ యామమున రాత్రి12.21 గంటలకు లింగోద్బవ సమయమున  విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చనలు, పూజాధికములు, 4 యామమున ఉదయం 3.28 గంటలకు శివునికి అభిషేకములు,  గణపతి హోమము, రుద్ర హోమము, మహా పూర్ణాహుతి, అనంతరం  కలశోద్వాసవతీ తీర్థ ప్రసాద వితరణ  మహాదాశీర్వచనము ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని బాలసాయిబాబా సెంట్రల్​ ట్రస్టు చైర్మన్​ టి. రామారావు వెల్లడించారు.

About Author