PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాప్టో ఆధ్వర్యంలో… మోకాళ్లపై నిరసన

1 min read

ట్రాన్స్​ ఫర్​లో లోపాలు సవరించాలని డిమాండ్​

పల్లెవెలుగు: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ఉన్న లోపాలను సవరించాలని డిమాండ్​ చేస్తూ ఆదివారం కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు  ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్​ కె. ప్రకాశ్​ రావు మాట్లాడుతూ  ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ న్యాయబద్ధంగా జరపాలని, అదేవిధంగా  ప్రమోషన్​ కౌన్సిలింగ్​ను మ్యానువల్​ పద్ధతిలో జరపాలని డిమాండ్​ చేశారు.  ప్రమోషన్​ కౌన్సిలింగ్​ను మ్యానువల్​గా జరిపేందుకు విద్యాశాఖ మంత్రి ఒప్పుకున్నారని, కానీ ఆన్​లైన్​లోనే అప్లై చేసేందుకు విద్యాశాఖాధికారులు ప్రయత్నించడం అన్యాయమన్నారు.  రాష్ట్ర ఉపాధ్యాయుల విన్నపం మేరకు పదోన్నతుల కౌన్సిలింగ్​ను మ్యానువల్​గా చేయాలని కోరారు. అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు తిమ్మన్న మాట్లాడారు.   నిరసన కార్యక్రమంలో  ఫ్యాప్టో రాష్ర్ట కార్యనిర్వహక సభ్యులు జి. హృదయ రాజు(APTF-1938) మరియు కర్నూలు జిల్లా FAPTO ఛైర్మన్ గోకారీ, నంద్యాల జిల్లా FAPTO ఛైర్మెన్ మాధవ స్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author