NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల జీజీహెచ్​లో..  రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించండి

1 min read

రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించండి

ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్.

ఆసుపత్రికి అవసరమైన పరికరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వండి

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: ప్రతిరోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు దాదాపు 1500 రోగులు వస్తుంటారని వచ్చే రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు సి.శ్రీదేవి, శ్రీరామమూర్తి, శివశంకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏ. శ్రీదేవి, జిజిహెచ్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, డిఎంహెచ్ఓ డా.వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు దాదాపు 1500 రోగులు వస్తుంటారని వచ్చే రోగులకు అన్ని మౌలిక సదుపాయాలు ఉండడంతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, త్రాగునీటి వసతి, మౌలిక సదుపాయాల మరమ్మతులను హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధుల నుండి వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటినుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి అవసరమైన పరికరాలు, వైద్య సిబ్బంది తదితర అంశాలపై చర్చించి అవసరమైన నిధులు సమకూర్చుకొని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి జిజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు.ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండి పేదవారి పట్ల మానవతా దృక్పథంతో మంచి వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రికి ఒక గుర్తింపు తీసుకురావాలన్నారు. ఆసుపత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొంటూ కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలన్నారు. రహదారి ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు ఇతర అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని మంత్రి ఆదేశించారు. గతంలో పెండింగ్ ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబరింగ్ స్టేషనరీ, సిసి కెమెరా తదితర బిల్లులకు సంబంధించిన నిధులను ఆమోదించామన్నారు. ఆసుపత్రికి అవసరమైన తాగునీటి సౌకర్యాన్ని అమృత స్కీం కింద ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పేద ప్రజలు వైద్యం కోసం ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్న వసతులను మరింత పటిష్టం చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. హాస్పటల్లో పారిశుధ్య లోపం, టాయిలెట్ల నిర్వహణ లేకపోవడం, త్రాగునీటి సమస్య, పరికారాలు లేకపోవడం, పరికరాలు ఉంటే టెక్నీషియన్స్ లేకపోవడం తదితర లోపాలు ఉన్నట్లు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారని … వీటన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో సమకూర్చాలని జిజిహెచ్ సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. సిఎస్ఆర్ నిధులతో ఆర్వో ప్లాంట్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయిస్తామని ప్రొసీజర్ ప్రకారం ఎస్టిమేట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి దస్త్రాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డయాలసిస్, ఎక్స్ రే ఎక్విప్మెంట్, బ్లడ్ బ్యాంకులో రిఫ్రిజిరేటర్లు, 24 గంటల ల్యాబ్, బయో కెమిస్ట్రీ కి సంబంధించిన డిస్టిల్ వాటర్, తదితర రోగులకు అవసరమైన వైద్య పరికరాలను  హాస్పిటల్ డెవలప్మెంట్ నిధుల నుండి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్పిటల్ కు అన్ని విధాల సపోర్టు ఇచ్చి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలో నీటి కొరత లేకుండా మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *