విద్య, వైద్యాభివృద్ధికి కృషి చేయండి
1 min read
- డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ కి సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
- రాజధానిలో హెల్త్ యూనివర్శిటీ అనుసంధానంగా మెడికల్ కాలేజి, హాస్పిటల్ కు స్థలం కేటాయించాలని మంత్రికి విన్నవించిన వీసీ
విజయవాడ, న్యూస్ నేడు: రాష్ట్రంలో డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కి సంబంధించి విద్య, వైద్యాభివృద్ధికి విశేష కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్ యాదవ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ కు సూచించారు. సోమవారం విజయవాడలోని మంత్రి ఛాంబరులో యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి… శాలువాతో ఘనంగా సన్మానించారు. రాజధాని అమరావతిలో యూనివర్శిటీకి అను సంధానంగా మెడికల్ కాలేజి, హాస్పిటల్ ఏర్పాటుకు దాదాపు 40 ఎకరాలు స్థలం కేటాయించాలని మంత్రి ని కోరినట్లు వీసీ . డా. చంద్ర శేఖర్ తెలిపారు. ఈ విషయమై సీఎం చంద్ర బాబు నాయుడుకు విన్నవించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రోత్సహించి… యూనివర్శిటీ అభివృద్ధికి కృషి చేయాలని, అమరావతిలో స్థలం కేటాయింపు పై సీఎం చంద్ర బాబు నాయుడు దృష్టికి తాను కూడా తీసుకెళ్తానని మంత్రి డా. సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నట్లు వీసీ డా. చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. అదేవిధంగా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణ బాబును మర్యాద పూర్వకంగా కలిసి డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీకి సంబంధించిన అభివృద్ధిపై వెల్లడించినట్లు వీసీ డా. చంద్ర శేఖర్ వెల్లడించారు.