దేవాలయంలో పూజలు చేసిన ఎంపీ బైరెడ్డి శబరి..
1 min read
ఎంపీకి ఘన స్వాగతం పలికిన నాయకులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు మరియు పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పూజలు చేశారు.ఆదివారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఎంపీకి గ్రామ నాయకులు తువ్వా భగీరథ రెడ్డి,తువ్వా అయ్యప్ప రెడ్డి ఆధ్వర్యంలో సహకార సొసైటీ నుండి దేవాలయం వరకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలికారు.దేవాలయంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భూమా కృష్ణమోహన్,ఈఓ వెంకటరమణ మరియు వేద పండితులు ఆహ్వానం పలికారు.అనంతరం ఎంపీ పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు,పైపాలెం సర్పంచ్ రామచంద్రుడు, నవాజ్ అలీ,శ్రీనివాసులు నాయుడు,మురళీధర్ రెడ్డి, బంగారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
