NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పద్మశాలి కల్యాణ మండపానికి రూ.4 లక్షల విలువైన జనరేటర్ విరాళం

1 min read

బుట్టా శివ నీలకంఠ, విశ్వనాధ్ రమేష్ ఆధ్వర్యంలో జనరేటర్ ప్రారంభోత్సవం

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో  ఉన్న పద్మశాలి కల్యాణ మండపంలో విద్యుత్ విఘ్నాలు లేకుండా కార్యాచరణ కొనసాగించేందుకు బుట్టా ఫౌండేషన్ నుండి రూ.4 లక్షల విలువైన జనరేటర్‌ను విరాళంగా అందించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ జనరేటర్‌ను బుట్టా ఫౌండేషన్ అధినేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ , పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షులు విశ్వనాధ్ రమేష్  సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా బుట్టా శివ నీలకంఠ  మాట్లాడుతూ –“సమాజ హితం కోసం పని చేయడం మన బాధ్యత. ప్రజలకు ఉపయోగపడే స్థలాల అభివృద్ధి కోసం బుట్టా ఫౌండేషన్ తరఫున విరాళాలు అందించడం గర్వంగా భావిస్తున్నాం. పద్మశాలి కళ్యాణ మండపం వంటి సామాజిక కేంద్రాలకు సాంకేతిక వసతులు కల్పించడం వల్ల ప్రజలకు నిరంతర సేవలు అందడం సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.విశ్వనాధ్ రమేష్  మాట్లాడుతూ పద్మశాలి సంఘం తరఫున బుట్టా ఫౌండేషన్ అధినేతలు శ్రీ బుట్టా శివ నీలకంఠ,శ్రీమతి బుట్టా రేణుక  దంపదులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పద్మశాలి సంఘం సమాజానికి అందిస్తున్న సేవల మరింత సమర్థవంతమైన నిర్వహణకు ఈ జనరేటర్ ఉపయోగపడుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చూపుతున్న నిబద్ధతకు ఇది ప్రతిరూపం” అని వివరించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ & వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు డి. నజీర్ అహమ్మద్, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యు.కె. రాజశేఖర్, పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశప్ప, పట్టణ ఉపాధ్యక్షులు కోటకొండ నరసింహులు, పట్టణ ప్రధాన కార్యదర్శులు విశ్వనాథ్, మహబూబ్ బేగ్, వెంకటాపురం రాజు, పద్మశాలి సంఘం ట్రెజరర్ ఊరుకుందు, బౌద్ధ సంఘం అధ్యక్షులు సిపి. రంగస్వామి, ఉపాధ్యక్షులు శ్రీరాములు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *