కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తుంది…
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
తల్లికి వందనం ఇంకా లబ్ధి పొందని తల్లులకు నగదు జమ అయ్యేలా చర్యలు చేపడతాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కార్యదక్షతతో పనిచేసేందుకు అవసరమైన శక్తిసామర్ద్యాలు, నిబద్దత కలిగిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. అలాగే తల్లికి వందన పథకంలో అర్హత ఉండీ ఇంకా లబ్దిపొందని తల్లలకు కూడా నగదు జమ అయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఏలూరు 48,49 డివిజన్ పరిధిలోని 3,4 సచివాలయాలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించీ, అమలు చేసిన తల్లికి వందనం పథకంలోని అర్హుల జాబితాలో ఉండీ నగదు జమకాని వారికి ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. అలాగే పలువురు లబ్దిదారులతో మాట్లాడి, వారిలో భరోసా నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో అర్హుల జాబితాలో పేర్లు నమోదైనా నగదు జమకాని తల్లులు కొందరు ఉన్నారని, వారికి ఎదురైన సాంకేతిక సమస్యలను, ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సచివాలయాల సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశామన్నారు. త్వరలోనే అర్హులైన మిగిలిన తల్లుల ఖాతాల్లో కూడా నగదు జమ అవుతుందని భరోసా ఇచ్చారు. అలాగే 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకు సంబంధించిన లబ్ది ఈ నెల 30వ తేదీన వారి తల్లుల ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఎవ్వరూ అధైర్యపడొద్దని, అర్హులందరికీ న్యాయం చేసేందుకు తాను కృషిచేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏలూరు ఎఎంసి ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, కో – ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
