పాఠశాలకు ఫ్యాన్లు లైట్లను అందజేసిన..భూషి గౌడ్
1 min read
మాండ్ర శివానందరెడ్డి..ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పంపిణీ..
నందికొట్కూరు, న్యూస్ నేడు: తమ పిల్లలు పాఠశాలలో చదువుతున్న పాఠశాలను ఏ విధంగానైనా తమ వంతుగా సహకారం అందించాలనే తలంపుతో ఆ పాఠశాలకు ఫ్యాన్లు లైట్లను అందించి తన మనస్తత్వాన్ని గొప్పగా చాటుకున్నారు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ భూషి గౌడ్..నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం పగిడ్యాల మోడల్ పాఠశాలకు 30 వేల నగదుతో ఫ్యాన్లు-6,ట్యూబ్ లైట్లు-24 పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుకు భూషి గౌడ్ అందజేశారు.ఇదే పాఠశాలలో భూషి గౌడ్ కుమార్తెలు కుమారుడు భార్గవి,హారిక, వంశీ గౌడ్ విద్యను అభ్యసిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా చక్కగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భూషి గౌడ్ విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రమణ గౌడ్, నాగేంద్ర గౌడ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.