PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏ.పి మోడల్ స్కూల్ ని సందర్శించిన ఎం.పి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పుటకలమర్రి గ్రామంలోని ఏ.పి మోడల్ స్కూల్ ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు  సందర్శించారు .. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన ఎం.పి , స్కూల్ లో కలిపిస్తున్న వసతుల పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ శీలమ్మ తో సమావేశమైన ఆయన పాఠశాల లోని పలు అంశాలపై చర్చించారు.. అనంతరం ప్రిన్సిపల్ శీలమ్మ స్కూల్ సమస్యల పై ఎం.పి నాగరాజు కి వినతిపత్రం సమర్పించగా, స్కూల్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎం.పి హామీ ఇచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *