PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

125 అడుగుల అంబేద్కర్​ విగ్రహం ఏర్పాటు చేయాలి

1 min read
మాట్లాడుతున్న కొండిస్వామి

మాట్లాడుతున్న కొండిస్వామి

– బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా నాయకులు కొండి స్వామి
పల్లెవెలుగు వెబ్​, రామాయంపేట: రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్యదేవుడు డా.బీఆర్​. అంబేద్కర్​ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్​ నడిబొడ్డున ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా నాయకులు కొండి స్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిజాంపేట మండలకేంద్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో దళితుల గొంతుగా ప్రశ్నించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆత్మగౌరవం కాపాడుకొని, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రామాయంపేట,నిజాంపేట దళిత మోర్చా అధ్యక్షులు సములు,రాజు,బీజేపీ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author