NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిడుగు పడి ఎద్దు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తుగ్గలి మండలం నల్ల గుండ్ల గ్రామంలో సోమవారము రాత్రి పిడుగుపాటుకు సుమారు 70 వేల రూపాయల విలువచేసే ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఎన్ ఈ మునేశ్వర గౌడ్ అనే రైతుకు చెందిన ఎద్దు గత రాత్రి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. గత రెండు రోజులుగా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాత్రి మునేశ్వర గౌడ్ కళ్ళం దొడ్డిలో కట్టేసిన వేలాది రూపాయల విలువచేసే ఎద్దు మృతి చెందడంతో మునేశ్వర గౌడ్ కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం పైనే ఆధారపడి జీవించే తమకు వేలాది రూపాయల విలువచేసే ఎద్దు మృతి చెందడం బాధాకరంగా ఉందని తమకు ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని నల్లగుండ్ల గ్రామానికి చెందిన మునేశ్వర్ గౌడ్, తండ్రి శ్రీనివాసులు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

About Author