NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

40 మందితో వెళ్తున్న బస్సు.. ఉన్నట్టుండి మంటలు !

1 min read

పల్లెవలుగువెబ్ : కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. గుడివాడ-మానికొండ రోడ్డులో వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణందా దగ్ధమైంది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న పల్లెవెలుగు పెద్దపారుపూడి మండలం వెంట్రప్రగడ చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. వారిలో వివిధ పనులపై వెళ్లేవారు, విద్యార్థులున్నారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులుంతా ఆందోళనకు గురయ్యారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో పుస్తకాలు, బ్యాగులు కూడా వదిలేసి దూకేశారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా.. లగేజీ బ్యాగుల్లో ఉన్న నగదు, బంగారం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

About Author