PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూదమాడుతున్న ఐదు మంది పై కేసు నమోదు.. ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: కర్నూలు జిల్లా ఎస్పి శ్రీ G. కృష్ణకాంత్, ఆదేశాల మేరకు. ఓర్వకల్లు ఎస్ఐ మల్లికార్జున మరియు కర్నూలు సెబ్ పోలీసులు కలిసి ఓర్వకల్ మండలం, ఉప్పలపాడు గ్రామము ఊరిబయట గల కల్లము లో కొంతమంది జూదం ఆడుతున్నారని పక్క సమాచారం మేరకు శుక్రవారం నాడు ఉప్పలపాడుగ్రామానికి చెందిన 5 మంది డబ్బులు పెట్టి పెక ముక్కలతో అందర్ బాహర్ జూదము ఆడుచుండగా పట్టుకొని వారి నుండి Rs.11000/- రూపాయల నగదు, 3 సెల్ ఫోన్ లు, 2 ద్విచక్ర వాహనాలు, 52 పెక ముక్కలు స్వాధీనము చేసుకొని వారిని అరెస్టు చేయడము అయినది. ఎవరైనా మండలంలో పేకాట, మట్కా, నాటుసారా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని ఎస్సై హెచ్చరించారు.

About Author