PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంత భూమి సేకరిస్తారో స్పష్టమైన ప్రకటన జారీ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సంజీవయ్యసాగర్ (గాజులదిన్నె ప్రాజెక్టు) సామర్థ్యం పెంచడానికి రిజర్వాయర్ ఎత్తు పెంచే నేపథ్యంలో ఏయే సర్వే నెంబర్లలో ఎంత భూమి సేకరిస్తారో స్పష్టమైన ప్రకటన జారీ చేయాలనీ, భూసేకరణ చట్టం ప్రకారం మునిగిపోతున్న భూముల వివరాలను ఆయా గ్రామాలలో  గ్రామ సభల ద్వారా  రైతులకు తెలపాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందచేయాలని వీటన్నిటి పైన సమగ్ర నివేదికను బహిరంగంగా విడుదల చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ కి మరియు సూపరింటెండెంట్ ఇంజనీర్,  జలవనరుల శాఖ, కర్నూలు వారికి లేఖను పంపడమైనది.

About Author