PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీని దృత‌రాష్ట్రుడితో పోల్చిన కాంగ్రెస్ నేత

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత తౌకీర్ రజాఖాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చి కొత్త వివాదం సృష్టించారు. ఢిల్లీలోని జహంగీర్ పురిలో బుల్డోజర్ చర్యపై ప్రధాని మోదీని ఉద్ధేశించి తౌకీర్ రజాఖాన్ మాట్లాడారు. ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ గుడ్డిగా, చెవిటిగా ఉంటే భారతదేశంలో మళ్లీ మహాభారతం జరగకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. తౌకిర్ రజా ఇక్కడితో ఆగలేదు. ముస్లింలు తమ ఇళ్ల నుంచి వీధుల్లోకి వస్తే వారిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై, హిందూ సమాజంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు తౌకీర్ రజా ఖాన్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. యూపీ ఎన్నికలకు ముందు తౌకీర్ రజా ఖాన్ కాంగ్రెస్‌లో చేరారు.

                                        

About Author