PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ లో క‌ప్పు టీ 1000 రూపాయ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సాధార‌ణంగా క‌ప్పు టీ ధ‌ర 5 రూపాయలు లేదా 10 రూపాయ‌లు ఉంటుంది. ప్రత్యేకంగా అంటే ఓ 50 రూపాయలు ఉంటుంది. కానీ హైద‌రాబాద్ లోని ఓ చాయ్ హోట‌ల్ క‌ప్పు టీ ని 1000 రూపాయ‌ల‌కు విక్రయిస్తోంది. దీనికి కార‌ణం చాలా అరుదైన టీ పౌడ‌ర్ తో ఈ టీని త‌యారు చేయ‌డ‌మే. నీలోఫ‌ర్ కేఫ్ అంటే హైద‌రాబాద్ లో అంద‌రికీ తెలిసిన‌దే. ఇక్కడ చాయ్, బిస్కెట్లు విక్రయిస్తారు. ఈ కేఫ్ బంజారాహిల్స్ లో ఓ బ్రాంచ్ ప్రారంభించింది. ఈ బ్రాంచ్ లో గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడ‌ర్ తో టీని త‌యారు చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేజిన్నర గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడ‌ర్ ను అసోంలో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేశారు. ఆ వేలంలో కేజీ 75 వేల‌కు కొనుగోలు చేశారు. ప్రత్యేక‌మైన రుచిని క‌స్టమ‌ర్లకు అందించాల‌నే ఉద్దేశంతో ఈ టీని త‌యారు చేస్తున్నట్టు నిర్వాహ‌కులు చెబుతున్నారు.

About Author