NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిపాలన గణేశునికి ఘన వీడ్కోలు

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న పరిపాలన గణేశునికి మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఘన వీడ్కోలు పలికారు.మంగళవారం కలెక్టరేట్ ఆవరణంలో ప్రతిష్టించిన పరిపాలన గణపతి విగ్రహానికి పూజలు చేసి  జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా కలెక్టర్ గారి తల్లితండ్రులు గుమ్మళ్ళ బలరామయ్య  రిటైర్డ్ ఐఏఎస్, సుగుణ నిమజ్జనానికి సాగనంపారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కలెక్టరేట్  ఆవరణంలో ప్రతిష్టించిన పరిపాలన గణపతి విగ్రహానికి  పూజలు నిర్వహించి, గత తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న గణేశునికి మంగళవారం ఘన వీడ్కోలు పలికారు. తొలుత ఓల్డ్‌ సిటీలోని రాంబొట్ల దేవాలయం వినాయకునికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నిమజ్జన మార్గంలో కలెక్టర్  కుటుంబ సభ్యులతో కలిసి కోలాటం చేస్తున్న బృందాలతో కలిసి  కోలాటం చేస్తూ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు.  కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన రావు, కర్నూల్ ఆర్ డి ఓ హరి ప్రసాద్,కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author