PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా పెద్ద ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉత్సవం

1 min read

– నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఆంజనేయ స్వామి ఊరేగింపు పత్తికొండ పురవీధుల గుండా  

ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైయస్సార్ పార్టీ నాయకులు మాజీ కే డి సి సి బ్యాంక్ జిల్లా వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రారెడ్డి గ్రామపంచాయతీ ఈవో నరసింహులు                                       

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ స్థానిక తేరు బజారు నందు వెలసిన పురాతన ఆలయం శ్రీ పెద్ద ఆంజనేయస్వామి దేవాలయం నందు చివరి శనివారం తిరస్కరించుకొని పెద్ద ఆంజనేయస్వామి ఊరేగింపు ఉత్సవం పత్తికొండ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ మరియు వైయస్సార్ పార్టీ నాయకులు ఎస్ రామచంద్ర రెడ్డి గ్రామపంచాయతీ ఈవో నరసింహులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు గౌరవ అధ్యక్షులు గోవిందరాజులు లింగన్న జయరాముడు చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు రవిచంద్ర కుమార్ నరసింహులు పర్యవేక్షణలో నిర్వహించారు.  గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ పెద్ద ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధి అలాగే ప్రతి శ్రావణమాసంలో చివరి శనివారం ఆంజనేయస్వామి ఊరేగింపు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ ఊరేగింపు ఉత్సవంలో భక్తిశ్రద్ధలతో పెద్ద ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందారు. నాయి బ్రాహ్మణులు పత్తికొండలో ఏకతాటిపై నిలిచి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నాయి బ్రాహ్మణ ఐక్యత నిబద్ధతకు నిదర్శనమని వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శనివారం రాత్రి 8 నుండి తెల్లవారుజామున వరకు భజన పోటీలు నిర్వహించామని తెలిపారు.  శనివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  భక్తులు పాల్గొని పెద్ద ఆంజనేయస్వామి శ్రావణమాస చివరి శనివారపు ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు బద్రి, చిన్న శ్రీరాములు, రఘు, ట్రైలర్ రామంజి, నాగ, పోస్ట్ ఆంజనేయులు, రామంజి మరియు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆంజనేయస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

About Author