PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమాజ సేవకుడికి ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగు:దేవుడు తల్లితండ్రుల రూపంలో పిల్లలకు జన్మనిస్తే.. వైద్యులు వారికి పునర్జన్మ నిస్తారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. సోమవారం కర్నూల్ నగరంలోని గాయత్రీ  ఎస్టేట్​ సద్గురు దత్త పాలి క్లినిక్ లో సమాజ సేవకుడు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్  సీనియర్ వైద్యులు శంకర్ శర్మను శాలువా కప్పి పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీసాల సుమలత మాట్లాడుతూ డా. శంకర్​ శర్మ ప్రభుత్వ విధుల్లో ఉన్నప్పుడు ఎందరికో చికిత్సలు చేశారని, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజ సేవ చేస్తూనే ఉన్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం, క్రీడాకారులకు ఆటల వస్తువులు, అనాథ ఆశ్రమాల్లో అన్నదానం … ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారన్నారు. సమాజంలో సేవ చేసే వైద్యులు, దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా మీసాల సుమలత కోరారు.

About Author