PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరు ఎంఈఓ మౌలాలికి ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి మౌలాలికి ప్రజా ప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు ఘన సన్మానం చేశారు. ఈయన గతి 10 సంవత్సరాలుగా మిడుతూరు ఎంఈఓ గా పనిచేస్తూ బదిలీల్లో భాగంగా ఇటీవలే ఈయన కర్నూలుకు బదిలీ అయ్యారు.బదిలీ అయిన సందర్భంగా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలోవీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ  హాజరయ్యారు.గత పది సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి మండలంలో మీరు చేసిన కృషి ఎనలేనివని ఈయన సేవలను జడ్పిటిసి కొనియాడారు.ఎంఈఓ లు అధికారులు,ప్రజా ప్రతినిధులు ఎంఈఓ దంపతులకు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.బదిలీ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా సర్వసాధారణమని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు జి. హృదయ రాజు అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,నూతన ఎంఈఓ రామిరెడ్డి,ఎంఈఓ 2 శ్రీనాథ్, చౌటుకూరు గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్,ఎంపీడీవో జి ఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్, ప్రధానోపాధ్యాయులు సాయి తిమ్మయ్య,సత్యనారాయణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author