PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజనులకు వెలుగు నింపిన కలెక్టర్ గిరీషకి ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా లోని వీరబల్లి మండలం షికారి పాలెం గిరిజన బిడ్డలకు వెలుగు నింపిన కలెక్టర్ గిరీష గారికి జాయింట్ కలెక్టర్ తమిమ్ అన్సారియా గారికి, విద్యుత్తు శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానం చేసి అభినందనలు తెలిపారు సహాయం చేసిన అధికారులకు, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు విశ్వనాథ నాయక్, లంబాడ సంఘం జాతీయ నాయకులు మూడే శంకర్ నాయక్ మాట్లాడుతూ..అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారి పాలెం తండా గిరిజన బిడ్డలు దశాబ్దాల కాలంగా విద్యుత్తు సౌకర్యం లేక చీకటిలో మగ్గుతున్నారనే విషయాన్ని.. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి గిరిజన బిడ్డలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరగా.. వెంటనే స్పందించిన కలెక్టర్ గిరిశా పిఎస్ గారు.. సంబంధించిన అధికారులకు ఆదేశించి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించి గిరిజన బిడ్డలకు వెలుగు నింపారని తెలిపారు… అందులో భాగంగానే అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని గిరిజన బిడ్డలకు ఇచ్చి సంబంధించిన పట్టాలు మంజూరు చేసి గిరిజనులకు ఆదుకోవాలని తెలిపారు.స్పందించిన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ సంబంధించిన అధికారులతో సమన్వయం చేసి తప్పకుండా సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంబాడ సంఘం జాతీయ నాయకులు మూడే శంకర్ నాయక్ గిరిజన నాయకులు వినోజి దేవరాజు నాయక్, ఎల్లప్ప రానా జయపతి రామన్జులు నాయక్ దేవరాణి బాయప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author