PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీపనగండ్లలో టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో బుధవారం సాయంత్రం టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం జరిగినది.రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ గిత్త జయసూర్య పాల్గొన్నారు.భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మే నిఫెస్టో గురించి ప్రజలకు జయసూర్య వివరించారు అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర వాటి గురించి ప్రజలకు తెలియజేశారు.వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు ఉండాలని టిడిపి పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, గ్రామ నాయకులు మనోహర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,పైడాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వరరెడ్డి,సంపంగి రవీంద్రబాబు, రాజు,శంకర్,కరుణాకర్,నడిపి చెన్నయ్య,మునిస్వామి,ఎం రాజు,దాసు,చెన్నప్ప,డి రాజు,పి రాజు,ఏసేపు,శేషన్న,తిరుపాలు,శ్రీరాములు,శేషాద్రి,మౌలాలి,గఫార్,వేల్పుల చెంటి ప్రవీణ్,మోహిద్దీన్ ,రాజశేఖర్ రెడ్డి,రమణారెడ్డి,లక్ష్మీనారాయణ,గట్టు రవి,సుభాన్,విష్ణు,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author