NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీను ఆర్ట్స్ అకాడమికి అవార్డుల పంట

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విశాఖపట్నం చోడవరం చిత్రకళా నిలయం6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలతో నందికొట్కూరు పట్టణానికి  చెందిన శ్రీను ఆర్ట్ అకాడమీ అవార్డులను దక్కించుకుంది. డైరెక్టర్  దేశెట్టి శ్రీనివాసులుకు జాతీయ పరమ గురూజీ పురస్కారం అలాగే  చిన్నారులు 22 మందికి గోల్డ్ మెడల్స్ ల లభించాయి.  నవ నంది, స్కాలర్, సెయింట్  మేరీస్ విద్యార్థులకు అవార్డులు దక్కాయి. వీరికి బహుమతి ప్రదానం నవంబర్ 4వతేదీ చోడవరం ప్రేమసమాజంలో బహుమతుల ప్రదానం జరుగుతుందని ఆయన తెలిపారు.

స్కాలర్స్ స్కూల్ విద్యార్థులకు అవార్డులు..

చోడవరం చిత్రకళా నిలయం వారు నిర్వహించిన ఆల్ ఇండియా డ్రాయింగ్ కాంపిటీషన్లో స్కాలర్ స్కూల్ కు చెందిన ఐదు మంది విద్యార్థినీ విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు వీరికి నవంబర్ 4వ తేదీన చోడవరంలో బంగారు పతకాలు ప్రశంసా పత్రాలు చోడవరం చిత్ర కళానిలయం వారు అందజేస్తారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కాలూరి శివప్రసాద్  మరియు డ్రాయింగ్ మాస్టర్ శీను  విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.

About Author