PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడికి చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు  : వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన ఎన్ఎస్ సయ్యద్ మీర్కి చిన్ననాటి మిత్రులు ఆత్మీయ సన్మానం ఘనంగా నిర్వహించారు. సిద్ధపల్లి రస్తాలోని ఎల్.వి కన్వెన్షన్ హాల్లో మిత్రులు బుకేలతో స్వాగతం పలికి పూలదండలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.సయ్యద్ మీర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పట్టణ అధ్యక్షుడు పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు  రఫిక్, అల్లిసా, సయ్యద్ షఫీవుల్లా మాట్లాడుతూ చిన్ననాటి నుంచి ఎన్ఎస్ సయ్యద్ మీర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే వాడన్నారు. పాఠశాలలో చదివే సమయంలో తోటి స్నేహితులకు స్నేహితులకు విద్యాపరంగా చేయూతనందించేవాడన్నారు. తమతో పాటు చదివిన మా మిత్రుడు పట్టణ స్థాయిలో గౌరవప్రదమైన పార్టీ పదవిలో కొనసాగడం తమకందరికీ గర్వకారణం అన్నారు. మా మిత్రుడి కుటుంబ నేపథ్యంకు పార్టీ పదవి తోడు కావడంతో మరింత మందికి సహాయం చేసే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు మా దృష్టికి తీసుకురావడంతో మేము మా మిత్రుడైన సయ్యద్ మీర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆత్మీయ సన్మానంలో మిత్రులు ఉస్మాన్, ముల్లా షఫీవుల్లా, మహబూబ్ భాష, ఎండి రఫీక్, గఫార్, ఆర్ఎంపి రషీద్, ప్రధాన ఉపాధ్యాయులు హుస్సేన్ భాష, రహిమాన్, మెడికల్ మున్నా, రహంతుల్లా మౌలానా, ఎన్ ఎస్ జయీమ్, రషీద్ తోపాటు అధిక సంఖ్యలో మిత్రులు పాల్గొన్నారు.

About Author