PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ కు భారీ ఊర‌ట‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గురువారం భారీ ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్‌పై న‌మోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో తొలుత సీబీఐ కేసుల‌పైనే విచార‌ణ జ‌ర‌పాల‌ని, ఆ త‌ర్వాతే ఈడీ కేసుల‌పై విచార‌ణ సాగించాల‌ని తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి జ‌గ‌న్‌పై తొలుత‌ సీబీఐ కేసులు న‌మోదు చేయ‌గా… ఆ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కూడా కేసులు న‌మోదు చేసింది. ఈ కేసుల్లో ఇప్ప‌టికే చార్జిషీట్లు దాఖలు కాగా… ఈ కేసుల‌పై తుది విచార‌ణ‌లు నాంప‌ల్లిలో కోర్టులో మొద‌లు కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో తొలుత సీబీఐ కేసుల‌పై విచార‌ణ సాగాల‌ని, ఆ త‌ర్వాత ఈడీ కేసుల‌పై విచార‌ణ సాగాల‌ని జ‌గ‌న్ స‌హా ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, జ‌గ‌తి పబ్లికేష‌న్స్‌, భార‌తి సిమెంట్స్ పిటిష‌న్లు దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

                                                  

About Author