PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో  కార్మిక సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ రెవెన్యూ డివిజన్ లో కార్మిక సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఏ ఐ టీ యుసి  ఆధ్వర్యంలో మంగ్లవారం స్థానిక రెవిన్యూ డివిజనల్ (ఆర్డీవో) అధికారి మోహన్ దాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య మాట్లాడుతూ,పత్తికొండ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు మరియు అతి సమీపంలో దేవనకొండ, ఆస్పరి కలిసి ఏడు మండలాలు కు అనుకూలంగా రెవెన్యూ డివిజన్ కేంద్రం వుందన్నారు. పత్తికొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 20వేల నుండి 30 వేల వరకు ఆ సంఘటత రంగ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.కానీ కార్మికుల సంక్షేమం గురించి కార్యాలయంలో పనులు జరుపుకొనుటకు కార్మిక సంక్షేమ కార్యాలయం అందుబాటులో లేదు. కార్మిక వర్గానికి ఇబ్బందికరంగా మారింది. డివిజన్ విస్తరణ పరిధిని పరిశీలించి కార్మికుల సంక్షేమ  కార్యకలా పాలునిర్వహించుకొనుటకు రెవిన్యూ డివిజన్ కేంద్రంలో ” కార్మిక సంక్షేమ కార్యాలయం”  ఏర్పాటు చేయాలని ఆర్డీవో కు వినతిపత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా ప్రధాన కార్యదర్శి ఎం. రంగన్న,  ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్షులు జి. నెట్టికంటయ్య, పెయింటర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి .తిమ్మన్న, వై. ఆదినారాయణ పెయింటర్స్ కార్మికులు కే. నాగరాజు, శ్రీనివాసులు, రంగన్న, బీమా ,బాలు రవికుమార్ ఆటో కార్మికులు కె. హుసేని, బి. విజయ్, ఎస్. రఫీ, ఎస్. పీరా తదితరులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ, రెవిన్యూ డివిజన్​, సంక్షేమం,

About Author