PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు

1 min read

– కొవ్వూరు సబ్ జడ్జి కె వెంకటేశ్వరావు దంపతులు ప్రత్యేక పూజలు..
పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా. జంగారెడ్డిగూడెం మండలo గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. కొవ్వూరు సబ్ జడ్జి కె వెంకటేశ్వర రావు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకొన్నారు. ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల.వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,28,181/- లు సమకూరినది. సుమారు 1000 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది మరియు వేసవికాలం దృష్ట్యా ఆలయమువద్ద మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు మజ్జిగ సేవించి ఎండనుండి ఉపశమనం పొందారని తెలిపారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్త మల్నీడి మోహనకృష్ణ(బాబీ), పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ , కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author