NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీట‌ర్ మేక పాలు 300 రూపాయ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మేకపాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. వారం కిందట లీటరుకు రూ.30 మాత్రమే ఉన్న మేక పాల ధర ఇప్పుడు రూ.300కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ పట్టణంలో డెంగీ కేసులు పెరిగాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే మేక పాలు తప్పకుండా తాగాల్సిందేననే ప్రచారం జరిగింది. దీంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి మరీ మేక పాలను ప్రజలు కొంటున్నారు. ఈ పరిణామం ఛత్తార్‌పూర్‌ పట్టణం శివారులోని గ్రామాల మేకల కాపరులకు కాసుల పంట పండిస్తోంది. డెంగీ వచ్చిన వారు మేకపాలు తాగాలనే నియమమేదీ లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

About Author