NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరెంట్ స్తంభాన్ని ఢీ కొన్న లారీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన మిడుతూరు సమీపంలో ఉన్న నందికొట్కూరు ప్రధాన రహదారి పంచముఖి గోడౌన్ దగ్గర గడివేముల జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి కర్ణాటక(కెఏ 34సి 2286)లారీ బళ్లారికి వెళ్తూ ఉండగా ఆదివారం ఉదయం 5:30 కు పంచ ముఖి గోడౌన్ దగ్గర లారీ డ్రైవర్ ప్రతాప్ నిద్రలో ఉన్నందున రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని లారీ ఢీకొట్టడంతో స్తంభం విరిగిపడి కరెంట్ వైర్లు లారీ మీద పడడంతో వెంటనే లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ నుండి దూకేశాడు.విపరీతమైన మంటలతో లారీ మంటల్లో దగ్ధమైంది.మంటలను చూసి రోడ్డు మార్గాన వెళ్తున్న ప్రయాణికులు భయ భ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు,ఫైర్ ఇంజన్ అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. కర్నూలు నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటల్లో దగ్ధమవుతున్న లారీని మంటలను నీళ్లతో ఆర్పి వేశారు.

About Author