PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నులు నుంచి వెళ్తూ.. 300 గ్యాస్ సిలిండ‌ర్లు ఉన్న లారీ పేలుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌కాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఇంజన్‎లో మంటలు చెలరేగి లారీకి వ్యాపించాయి. మంటల దాటికి గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. కానీ.. గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడంతో మంటలను ఫైర్ సిబ్బంది కూడా అదుపులోకి తీసుకురాలేకపోయారు. భారీ శబ్దంతో సిలిండర్లు పేలడంతో రాత్రంతా దద్దవాడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారు. 100కి పైగా గ్యాస్ సిలిండర్లు పేలినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడని తెలిపారు. ఈ ఘటన కర్నూలు నుండి నెల్లూరు జిల్లా ఉలవపాడు వెళ్తుండగా చోటు చేసుకుంది.

                                      

About Author