PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేపలు వేటకి వెళ్లి వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: చేపలు వేటకి వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్యాపిలి మండల పరిధిలోని వెంగళపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు మేరకు వెంగనాంపల్లి గ్రామనికి చెందిన దాళవాయి రామచంద్రడు( 52) గ్రామ సమీపంలోని చిన్న చెరువుకి శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం రామచంద్రుడు చెరువులోకి చేపల వల వేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ చేపల వల రామచంద్రుడు కాళ్ళకి చుట్టుకొని చెరువులోకి పడ్డారు. తనతోపాటు చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు గమనించి రామచంద్రుని వెతుకుతుండగా నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో రామచంద్రడు అప్పటికే నీటిలోనే మృతిచెందినట్లు చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు తెలిపారు. ఈయనకు భర్య అది లక్ష్మీ ,ఇద్దరూ కుమారులు వున్నారు. ఈవిషయంలో ప్యాపిలి పోలీసులకు తెల్పడంతో సంఘటన స్థాలనికి వారు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు.

About Author