PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీరంగాపురం: ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరంగాపురం పెబ్బేరు మండలాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని బిరం రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ సమస్యలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పార్టీ విధివిధానాలకు సంబంధించి గ్రామస్థాయిలోని కార్యకర్తలతో ఎమ్మెల్యే మెగా రెడ్డి నేరుగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం పెబ్బేర్ వేదికగా వల్లపు రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి మొదలవుతుందని గ్రామాల వారిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

About Author