PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన రోడ్డును ఏర్పాటు చేయాలి – టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

1 min read

– మాజీ ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు

పల్లెవెలుగు వెబ్ హోళగుంద:  టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో ఆదోని ఎల్లార్తి రోడ్డు కూడలిలో టిడిపి పార్టీ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణ కోసం ధర్నా చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే టిడిపి ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గం కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ మండలంలో ఎక్కడ చూసినా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. అని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా. _హోళగుంద–హెబ్బటం మీదుగా ఆదోని రోడ్డు–హోళగుంద–మార్లమడికి రోడ్డు పనులు వెంటనే చేపట్టి నూతన రోడ్డును ఏర్పాటు చేయాలని. వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పనులు మధ్యలో ఆగిపోవడంతో ఈ రోడ్డు మార్గంలో ఉన్న బస్సులను ఆర్టీసీ అధికారులు కొన్ని రోజులపాటు బస్సులను కూడా నిలిపివేయడంతో ఈ రోడ్డు మార్గంలో ఉన్న గ్రామాలకు వెళ్లే రైతులు ప్రజలు విద్యార్థులు రవాణా సౌకర్య లేక ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. రోడ్డు పనులు యధావితగా కొనసాగించి నూతన రోడ్డు పనులు ప్రారంభించాలని. వారు డిమాండ్ ఇచ్చారు ఈ రోడ్డు మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరు రోజు నరకయాతన అనుభవిస్తున్నారని ఎక్కడ చూసినా మోకాళ్ళలోకి గుంతలు పడటం వర్షాలు వస్తే ఏ గుంతలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నంత అధికారులు మంత్రిగారు చొరవ తీసుకొని రోడ్డు పనులను యధావిధిగా కొనసాగించి నూతన రోడ్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షాన అన్ని గ్రామాల రైతులను ప్రజలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి రోడ్డు పనులు కొనసాగించేంతవరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యధావిధిగా ఉద్యమాలకు కార్యచరణ చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు యువ నాయకులు టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ, డిమాండ్​, ఎమ్మెల్యే, టిఎన్​ఎస్​ఎఫ్​,

About Author