వ్యక్తిత్వం లేని పార్టీ.. వైసీపీ పార్టీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు మహిళ కమిటి అధ్యక్షులు అయిన మేము అనగా 1) షేక్ ముంతాజ్ 2) మారుతి శర్మ లు 3) రాజ్యలక్ష్మి గత 4రోజుల క్రితం జరిగిన సాక్షి డిబేట్లో అదే పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అనబడే ఇద్దరు వ్యక్తులు మహిళలను కించపరిచే విధంగా అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడడం జరిగింది. దీనికి ఆ యాంకర్ కూడా ఒక నవ్వు నవ్వారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు మహిళలను గౌరవించే సాంప్రదాయం లో ఉన్న వ్యక్తి ఆయన అమరావతి దేవతల రాజధాని అని కొని ఆడితే వీరు ఇలా మహిళల పట్ల అసభ్యంగా అసహనంగా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నది. ఇలాంటి వ్యక్తిత్వం లేని వైసీపీ పార్టీలు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో అనేది అందరికీ తెలుస్తుంది ఈ సభ్య సమాజం లో ఇలా మాట్లాడినందుకు గాను మా మహిళల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడినందుకు కాను మమ్మల్ని మహిళలని ఆత్మ శోభకి గురి చేసినందుకు గాను వారి పైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించగలరని వేడుకుంటున్నాను సరైన చర్యలు తీసుకోగలరని కర్నూలు జిల్లా మరియు నియోజకవర్గం తరపునుండి మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దయచేసి తగు న్యాయం చేయగలరని మేము కోరుచున్నాము.