PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వార్షిక బడ్జెట్​లో కాపుల సంక్షేమానికి పెద్దపీఠ

1 min read

– వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ
పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి : ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో కాపుల సంక్షేమానికి సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి పెద్దపీఠ వేశారని వైఎస్సార్సీపీ రాష్టకార్యవర్గ సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ తెలిపారు. కాపుల సంక్షేమార్థం రూ.3306 కోట్లు కేటాయించడంపై సీఎం వైఎస్​ జగన్​కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలను ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి అమలు చేసి.. అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాలను సమాన దృష్టితో చూసి .. బడ్జెట్​లో నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఎన్నికలో ఇచ్చిన హామీలకు మించి సంక్షేమ పథకాలను అమలు చేయడం ఒక్క ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికే సాధ్యమైందని, రాష్ట్ర ప్రజలు సీఎం జగన్​కు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మల్లిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు.

About Author