PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైక్ యాక్సిడెంట్ లో వ్యక్తి మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ కర్నూలు రహదారిలో సోమవారం జరిగిన బైక్ యాక్సిడెంట్ లో ఒకరు మృతి చెందగా ఇంకొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. పత్తికొండ నుండి దేవనకొండకు బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా జింక దూకడంతో అదుపుతప్పి బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హుసేని 50 సంవత్సరాలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే బైకుపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలకు గురైన వ్యక్తిని చికిత్స కోసం అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితులు పరిశీలించారు. పార్థివదేహాన్ని పోస్టుమార్టం కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About Author