PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నై బళ్లారి జాతీయ రహదారిలోని చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాలెం పల్లె వద్ద సైకిల్ పై వెళ్తున్న పటాన్ నజీర్ అహ్మద్ ఖాన్47 వ్యక్తిని బుధవారం రాత్రి మోటార్ సైకిల్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజంపేట వద్ద మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి కడప నగరంలోని మట్టి పెద్దపులి బొమ్మ దగ్గర ఉన్న జంగం మెట్ల కాలనీకి చెందినవాడు. ఈయన పాలెం పల్లె వద్ద రహదారి లో ఉన్న ఐచర్ లారీ వర్క్ షాప్ లో మెకానికల్ గా పని చేస్తున్నాడు. రోజు లాగానే డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా మోటార్ సైకిల్ ఢీకొట్టడం జరిగింది. మృతి చెందిన వ్యక్తికి భార్య పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని చెన్నూర్ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author