NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కారుకు స్కూటర్ ఢీ… వ్యక్తి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : చెన్నూరు మండలం కడప- కర్నూల్ జాతీయ రహదారి శేషయ్య  పల్లె వద్ద రోడ్డు ప్రమాదం లో శుక్రవారం మధ్యాహ్నం చెన్నూరు మైనార్టీ కాలనీ ఏటిగడ్డ వీధి కి చెందిన జావేద్ హుషేన్ వయస్సు( 36) సంవత్సరాలు మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, చెన్నూరు మైనార్టీ కాలనీ ఏటిగడ్డ వీధికి చెందిన జావేద్ హుస్సేన్ కడప బండల ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని తెలిపారు, అయితే శుక్రవారం మధ్యాహ్నం కడప నుండి చెన్నూరు వచ్చే సమయంలో కడప నుండి మైదుకూరు మీదుగా వెళుతున్న ఇన్నోవా కార్ శేషయ్య పల్లె వద్దకు రాగ సడన్ గా కార్ ను వేగం తగ్గించడంతో వెనుక వైపు నుండి పల్సర్ బైక్ పై వస్తున్న జావిద్ హుస్సేన్ అదుపుతప్పి కారును వెనుక వైపు ఢీకొని కింద పడిపోగా అతని తలకు బలమైన గాయం తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, కాగా మృతునికి భార్య 6 మంది పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

About Author