PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైకోర్టులో ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్త్రీ శిశు సంక్షేమశాఖలో విస్తరణ అధికారుల నియామకాలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. 560 విస్తరణ అధికారుల నియామకానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాత పరీక్షలు నిర్వహించి ఇంగ్లీష్‌ ల్యాంగ్వేజ్ టెస్ట్‌‌ను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ముందుగా అభ్యర్ధులను ఎంపిక చేసుకుని, వారికే ల్యాంగ్వేజ్ టెస్ట్‌ పెట్టారని హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. ఒక్కో విస్తరణ అధికారి నియామకానికి రూ. పది లక్షలు వసూలు చేశారని పిటీషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్ వాదించారు.

                                       

About Author