PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో అధికార పార్టీకి షాక్

1 min read

దేవనూరు,సుంకేసుల కార్యకర్తలు టిడీపీ లోకి వలస

రాబోయే రోజుల్లో భారీగా చేరికలు:మాండ్ర

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో అధికార పార్టీకి షాక్ తగిలింది.మండలంలోని దేవనూరు,సుంకేసుల గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి,గ్రామ టీడీపీ నాయకులు దేవనూరు మాజీ సర్పంచ్ టి.నాగేంద్రుడు ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలోని నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి స్వగృహంలో బుధవారం సాయంత్రం గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలుయాకుబ్ బాష,వలీ వుద్దీన్, వెంకటరామిరెడ్డి,మహమ్మద్ ఆజం,అల్తాఫ్ అలీ,అన్వర్ బాష,తాహీర్ అలీ, నాగేంద్రుడు,షేక్ వలి,మదన్ గోపాల్,సలీం,శివశంకర్ నాయుడు,జాకీర్ అలీ,ఆఫ్రోస్ ఖాన్,అబ్దుల్ ఘని, వేణుగోపాల్,రాశద్ అహమ్మద్ వీరితో పాటు 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుంకేసుల గ్రామానికి చెందిన గ్రామ నాయకులు వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెంకట నరసయ్య,కుమ్మరి సుబ్బారావు,వెంగన్న,లక్ష్మిరెడ్డి, కృష్ణయ్య ఆచారి,బాల మద్దిలేటి,చిన్న వెంకటరమణ తదితరులకు తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ నేటి నుండి అధికార పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని రాష్ట్రంలో ఎక్కడ చూసినా కీలక నేతలు కూడా టిడిపి వైపు చూస్తూ పార్టీలో చేరుతున్నారని నందికొట్కూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని ఇంకా రాబోయే రోజుల్లో టిడిపి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని అంతే కాకుండా అధికార పార్టీ విధానాలు నచ్చక,అభివృద్ధి అంటే తెదేపా తోనే సాధ్యమనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం రావడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాండ్ర శివానందరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోహిద్దీన్,సుభాన్,ఐటీడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author